Holiday trip: విహారయాత్రలకు సిద్ధమవుతున్న భారతీయులు.. టాప్ డెస్టినేషన్లు ఇవే!
కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాదిన్నరగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మధ్యలో లాక్డౌన్ ఎత్తేసినా.. కరోనా కేసుల భయంతో బయటకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. మరోవైపు దేశాలు, రాష్ట్రాలు కొవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితులు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాదిన్నరగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మధ్యలో లాక్డౌన్ ఎత్తేసినా.. కరోనా కేసుల భయంతో బయటకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. మరోవైపు కొవిడ్ నిబంధనలు అమలవుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితులు మారుతున్నాయి. అన్ని చోట్ల ప్రజలకు వ్యాక్సిన్ వేస్తుండటంతో పర్యటకులను ఆహ్వానించేందుకు దేశాలు, రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఎప్పుడు నిబంధనలు తొలగిస్తారా? ఎప్పుడు విహారయాత్రకు వెళ్లిపోదామా అని భారతీయులు తెగ ఎదురుచూస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈనెలలో గత ఐదు రోజుల్లో భారతీయులు గూగుల్లో వెతికిన హాలీడే ట్రిప్ డెస్టినేషన్ ప్రాంతాల ఆధారంగా బుకింగ్.కామ్ అనే సంస్థ టాప్ 10 అంతర్జాతీయ, దేశీయ డెస్టినేషన్ జాబితాలను విడుదల చేసింది. మరి ఆ జాబితాలో ఏయే ప్రాంతాలున్నాయో చూద్దాం..!
విదేశీ విహారయాత్ర చేయాలనుకునేవారు ఎంచుకున్న దేశాల్లో యూఎస్ఏ, రష్యా, మాల్దీవులు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఖతర్, కెనడా, యూకే, మెక్సికో, అర్మేనియా, ఫ్రాన్స్ దేశాలున్నాయి. ఈ దేశాల్లో చూడదగ్గ ప్రాంతాల గురించి భారతీయ పర్యటకులు గూగుల్లో ఎక్కువగా అన్వేషించారట. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తే ఈ దేశాలను సందర్శించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ ఏడాది దేశీయ పర్యటక ప్రాంతాలను చూడాలని ఎక్కువ మంది భారతీయులు ఆసక్తి చూపుతున్నట్లు బుకింగ్.కామ్ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా దేశంలోని మెట్రో సిటీల గురించి, వాటికి దగ్గర్లో ఉండే పర్యటక ప్రాంతాల గురించి ఎక్కువగా గూగుల్ చేశారట. మొత్తంగా దేశీయ డెస్టినేషన్లలో తొలిస్థానంలో దేశ రాజధాని దిల్లీ ఉంది. రెండో స్థానంలో ముంబయి నగరం ఉండగా.. ముంబయికి సమీపంలో ఉండే లోనావాలా మూడో స్థానంలో నిలిచింది. బెంగళూరు, చెన్నై, కోల్కతా, జయపుర, హైదరాబాద్, లేహ్, ఉదయ్పూర్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా