Kids Health: మీ పిల్లలతో వ్యాయామం చేయించండిలా!
వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాయామం పెద్దలకు మాత్రమేనా పిల్లల సంగతేంటి?
ఇంటర్నెట్ డెస్క్: వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాయామం పెద్దలకు మాత్రమేనా పిల్లల సంగతేంటి?
వారి శరీరానికి కూడా వ్యాయామం అవసరం. పిల్లలు ఎక్కువగా తరగతి గదిలో గంటలపాటు కూర్చుని ఉండిపోతారు. ఈ కరోనా దెబ్బకు ఇంటికే పరిమితమయ్యారు. గంటల తరబడి ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే వ్యాయామం సంగతేంటి? ఇలా చేసి చూడండి
వీటిని కొనివ్వండి
సాధారణంగా పిల్లలకు బొమ్మలను కొనిస్తూనే ఉంటారు. వాటికి బదులుగా వారికి ఉపయోగపడేలా స్కిప్పింగ్, బాడ్మింటన్ రాకెట్ లాంటి ఆట పరికరాలను కొనివ్వండి. ఇలా చేయడం వల్ల వారికి బోర్గా అనిపించకుండా వీటితో ఆడుకుంటారు.
విహార యాత్రకు వీటినీ తీసుకెళ్లండి
పిల్లలను తల్లిదండ్రులు బయటకు తీసుకెళ్లాలనుకుంటే సెలవు రోజుల్లో కొంత విభిన్నంగా ప్రణాళికలను రూపొందించండి. స్విమ్మింగ్, మౌంటెన్ బైకింగ్ ఉండే ప్రాంతాలకు తీసుకెళ్లాలి. దీంతో ప్రకృతితో వారు మమేకం కాగలరు. ఇటువంటివి చేయడం అలవాటుగా చేసుకుంటే ఆనందకర కుటుంబాన్ని పొందగలరు.
ఇంటి పనులు చేసేలా ప్రోత్సహించండి
ఇంటిలో పనులకు పిల్లలను దూరంగా ఉంచుతారు తల్లిదండ్రులు కానీ అలా చేయడం మంచి పద్ధతి కాదు. వారికి చిన్న చిన్న పనులు చేసేలా ప్రోత్సహించాలి. వారు పనులు నేర్చుకున్నట్లూ ఉంటుంది. పనులు చేస్తుంటే వారి శరీరానికి వ్యాయామం చేసినట్లు కూడా ఉంటుంది.
టీవీ టైమ్ను తగ్గించండి
టీవీ చూస్తే కుటుంబం అంతా కలిసి చూడండి. వారికి రిమోట్ ఇచ్చేసి వదిలేయకూడదు. ఇలా చేయడం వల్ల వారు గంటల తరబడి తెరను చూస్తూనే ఉంటారు. దీంతో కంటి సమస్యలు తలెత్తుతాయి. అలాకాకుండా మీరు పిల్లలతో ఆడుకోండి. వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోండి. మీరు వారితో సమయం గడపకుంటే పిల్లలు మానసికంగా కుంగిపోతారు. ఒంటరిగా ఫీల్ అవుతారు.
ఈ కొద్ది పాటి మార్పులు చేసుకొని పిల్లలను వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..